Site icon TeluguMirchi.com

మెదక్ జిల్లా రచ్చబండ వాయిదా.. !

cm kiranమెదక్ జిల్లా సంగారెడ్డిలో రేపు జరగాల్సిన రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. ఈమేరకు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పలువురు తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశమయిన అనంతరం నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఢిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సీఎం రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పలువురు కాంగ్రెస్ నేతలు సైతం రచ్చబండలో పాల్గొనట్లేదని తేల్చిచెప్పడం.. దానికి తోడు పలువురు టీ-మంత్రులు రచ్చబండను వాయిదా వేసుకోవాలని సీఎం సూచించడంతో కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రచ్చబండ వాయిదాతో.. సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య అంతర్యుద్ధం మరింత ముదిరినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version