Site icon TeluguMirchi.com

విద్యాసాగర్‌రావు కన్నుమూత

తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్‌. విద్యాసాగర్‌రావు (77) కన్నుమూశారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజులుగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
ఉదయం తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్‌ రావు భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి హబ్సిగూడలోని ఆయన నివాసానికి తరలించారు. అంబర్‌పేట శ్మశానవాటికలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు వెల్లడించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన విద్యాసాగర్‌రావు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. నీటి పారుదల రంగంలో ఆయనకున్న అపార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆయన్ను నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించింది. ఒకరకంగా చెప్పాలంటే కేసిఆర్ కు విద్యాసాగర్‌రావు కుడి భుజం. అలాంటి విద్యాసాగర్‌రావు మృతి తీరని లోటు.

Exit mobile version