తెదేపా గూటికి భీమవరం ఎమ్మెల్యే!

ramanjaneyuluసీమాంధ్రలో తెదేపాలోనికి వలసలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ చెందిన పలువురు సీనియర్ నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పసుపు కండువా కప్పుకోనున్నారు. నేడు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో.. అంజిబాబు పార్టీలో చేరనున్నారు. కాగా, సీమాంధ్రలో మరికొంత మంది నేతలు తెదేపాలో చేరేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం.