జగన్ కు పీటీవారెంట్ !

jaganదాల్మియా సిమెంట్ కంపెనీకి సంబంధించి ఐదో ఛార్జి షీటులో.. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఈరోజు (గురువారం) పీటీ వారెంట్ ను జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జగన్ ను జూన్ 7న కోర్టుకు హాజరుపరచాల్సిందిగా న్యాయస్థానం చంఛల్ గూడ జైలు అధికారులను ఆదేశించింది. కాగా, ఇదే కేసుకు సంబంధించి జూన్ 7న కోర్టుకు హాజరు కావాలంటూ.. రాష్ర్ట హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి న్యాయస్థానం సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే.