నిర్ణయాత్మక చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా..!

ManmohanSinghఈ నెల 5నుంచి  30వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిర్ణయాత్మక చర్చలు జరుగుతాయని ఆశిస్తునన్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న అన్ని అంశాలపైన ఈ సమావేశాల్లో చర్చిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభ్యుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆహార భద్రతా బిల్లు ఈ సమావేశాలలో అమోదం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ అంశం.. తదితర అంశాలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి.