మరోవైపు, ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమీటి భేటీ అయింది. ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామా నేపథ్యంలో.. ఏం చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే, గవర్నర్ సుఫారు గానీ, కేంద్రం యోచన గానీ.. ఏపీలో రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపే విధంగా వున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఆందోళనలు, అవస్థలను చూసిన ఏపీ ప్రజలకు.. ముఖ్యమంత్రి కిరణ్ పుణ్యమా అని.. రాష్ట్రపతి పాలనను చూసే అవకాశం దక్కిందని పలువురు సైటైర్స్ వేస్తున్నారు………… !!