Site icon TeluguMirchi.com

మరో ఐదుగురికి గురి..!

pranab-mukherjeeరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘోరమైన నేరాలకు పాల్పడిన ఏడుగురిలో ఐదుగురు దోషులకు క్షమాభిక్షను నిరాకరించారు. మరో ఇద్దరి మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించారు. గతంలో కసబ్, అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. దాంతో వారిద్దరికి మరణ శిక్ష అమలు జరిగింది. ప్రస్తుతం ఐదు క్షమాభిక్ష పిటిషన్లను ప్రణబ్ తోసిపుచ్చడంతో.. ఇక అటువంటి పిటిషన్లు రాష్ర్టపతి వద్ద పెండింగులో లేవని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, అత్యధిక క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన ఏకైక ర్రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ముఖర్జీనే.

రాష్ర్టపతి తోసిపుచ్చిన క్షమాభిక్ష పిటిషన్ల వివరాలు :

Exit mobile version