Site icon TeluguMirchi.com

రాష్ట్రపతి ములాఖాత్ కు ప్రముఖుల క్యూ

Pranab Mukherjee leaving Hyderabad todayహైదరాబాద్ నగరానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు వీడ్కోలు చెప్పనుండడంతో ఆయనను కలవడానికి ప్రముఖులు క్యూ కట్టారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలంగాణ మంత్రులు కూడా తమ గోడు వెళ్ళబోసుకునేందుకు భేటీ అయ్యారు. రాష్ట్రపతికి మంత్రులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతికి మంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తమ బతుకులు బాగుపడుతాయని రాష్ట్రపతికి విన్నవించినట్లు సమాచారం. ఈ సంవత్సరమైనా నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, శ్రీధర్‌బాబు, బసవరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్రపతి ఇవాళ ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.

Exit mobile version