రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రాల విభజనపై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న జనాభా, అవసరాల రీత్యా ప్రజలందరినీ ఒకే చోట కలిపివుంచడం సాద్యం కాదని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుండి డిమాండ్లు వస్తున్నాయని అన్నారు. అయితే రాష్ట్రాల ఏర్పాటులో రాజకీయంగా, పరిపాలనా పరంగా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. కాగా, ప్రణబ్ వ్యాఖ్యలపై అప్పుడే చర్చలు మొదలైయ్యాయి. ఇంతకీ ప్రణబ్ విభజనను సమర్ధిస్తున్నట్లు? లేక వ్యతిరేకిస్తున్నట్లా? అనే చర్చలు జరుగుతున్నాయి.