అనంతపురం రానున్న రాష్ట్రపతి!

Pranabరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు (సోమవారం) అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొననున్నారు. అనంతరం ప్రణబ్ పుట్టపర్తిని సందర్శిస్తారు. రాష్ట్రపతి వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. రాష్ట్రపతి ప్రస్తుతం బొల్లారంలోని శీతాకాల విడిదిలో వున్న విషయం తెలిసిందే. అయితే,  రాష్ట్రపతి రాకను దృష్టిలో వుంచుకొని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడుతున్న నేపథ్యంలో.. పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.