Site icon TeluguMirchi.com

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట !

ponnala
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కొత్త కొత్త హామీలు గుప్పిస్తే ప్రజలు నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. నిన్న మొన్న పుట్టిన పార్టీలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాయని, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా తెరాస తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇంతకాలం రాజకీయాల్లో ఉండి కేసీఆర్ మెదక్ అభివృద్ధికి ఏం చేశారని పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని పొన్నాల పేర్కొన్నారు. పేదలకు భూపంపిణీపై కేసీఆర్ హామీ ఆచరణ సాధ్యంకాదని, లేని భూమిని ఎలా పంచుతారని పొన్నాల ప్రశ్నించారు.

Exit mobile version