Site icon TeluguMirchi.com

ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దు : పొంగులేటి

ponguleti-sudhakarreddyఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష విధించేలా చట్టాలను కఠినతరం చేయాలని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు పదునైన చట్టాలు తేవాలంటున్న కేంద్రానికి సహకరించాలని ఆయన కోరారు. పొంగులేటి నెలరోజుల్లోనే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణా జిల్లాల్లో నెలకొని ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దని టీఆర్ఎస్, టీ జేఏసీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కార్యక్రమాలను మంత్రుల నియోజకవర్గాల్లో నిరసనల పేరుతో టార్గెట్ చేస్తే సహించేది లేదని పొంగులేటి హెచ్చరించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు అందరూ సహకరించాలన్నారు.

Exit mobile version