Site icon TeluguMirchi.com

పవన్ ‘జనసేన’ సభపై ఆంక్షలు

pavan kalyanపవన్‌కల్యాణ్ ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. సభను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల్లోపు ముగించాలని సైబరాబాద్ డీసీపీ క్రాంతిరాణ టాటా ఆదేశాలు జారీ చేశారు. 4 వేల పాసులు మాత్రమే జారీ చేయాలని సూచించారు. పాసులు ఉన్నవారినే సభకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో రేపు శుక్రవారం మాదాపూర్‌లో ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది.

Exit mobile version