ఏపీఎన్జీవోలు ఈ నెల 22న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి లభించింది. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు.
అంతకు ముందు మాట్లాడిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు .. తాము చేపట్టే ధర్నాపై అపోహలు ఉన్నాయని అన్నారు. తాము తలపెట్టనున్నది ఛలో హైదరాబాద్ కాదని, ఇందిరా పార్కు వద్ద ధర్నా అని తెలిపారు. ఈ ధర్నాలో సుమారు 5 వేల మంది ఉద్యోగులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.