Site icon TeluguMirchi.com

స్థానిక సమరానికి తెరలేచింది

ballotరాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి తెరలేచింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 6వ తేదీన జెడ్పీటీసీ, ఎంటీసీల ఎన్నికలు జరుగుతాయి. బ్యాలెట్ పెట్టెల ద్వారానే ఈ ఎన్నికలు జరుగుతాయని, ఈ నెల 17వ తేదీన ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్లను కలెక్టర్లు విడుదల చేస్తారని ఈసీ చెప్పారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 21వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని ఆయన చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు.

Exit mobile version