ఇది శాంతి చర్చల పై జరిగిన దాడి: ప్రధాని

Manmohan-Singhజమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదుల దాడిపై ప్రదాని మన్మోహన్ స్పందించారు.దాడులకు తాము భయపడబోమని, మరింత చిత్తశుద్ధితో దాడులను ఎదుర్కొంటామని ప్రధాని అన్నారు. ఇది శాంతి, చర్చలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. శాంతిని వ్యతిరేకించే శక్తులే దాడులకు పాల్పడ్డాయని అన్నారు. పొరుగు దేశం సహాయసహకారాలతోనే తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారని, ఇలాంటి దాడుల వల్ల చర్చలకు విఘాతం కలగదని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి ఘటనలో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే.