Site icon TeluguMirchi.com

బాబుకు.. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్!

cbn(1)

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించారు. శాఖల వారీ్గా ఉద్యోగుల విభజన, భవనాల కేటాయింపు.. తదితర అంశాలను మహంతి తన ప్రజెంటేషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నవారికి బాబు అభినందనలు తెలిపారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తుండటం అభినందనీయమన్నారు. కాగా, సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ఉద్యోగులు తలో పదివేలు విరాళం ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

Exit mobile version