ఇటు ఆనందాలు.. అటు ఆందోళనలు.. !!

telangana-and-seemandhraఛారిత్రాత్మక తెలంగాణ బిల్లుకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. ’టీ’కి ఆమోదంతో.. రాష్ట్రంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రజాలోకం సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు కాలుస్తూ.. తెలంగాణ ఆటాపాటలతో దుమ్ములేపుతున్నారు. టీఆర్ ఎస్, భాజాపా, సీపీఐ, తెదేపా తెలంగాణ ఫోరం నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు, సీమాంధ్ర ప్రాంతంలో ఇందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన జ్వాలలతో సీమాంధ్ర రగిలిపోతోంది. నివధిక బంద్ కు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది.