Site icon TeluguMirchi.com

బిల్లు ఆగాలని కోరుకుంటున్నా: బొత్స

botsaతెలంగాణ బిల్లులో అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టే ఉభయసభలు బిల్లును వ్యతిరేకించడం జరిగిందన్నారు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. సీమాంధ్ర నేతగా రాష్ట్ర విభజన బిల్లు ఆగాలని కోరుకుంటున్నానని తెలిపారు. హైదరాబాదులో మాట్లాడుతూ.. తెలంగాణ నేతలు కోరుకుంటున్నట్టు బిల్లుపై చర్చ పూర్తయిందన్నారు. రాష్ట్ర విభజన బిల్లు విషయంలో ఒకరు గెలిచారు, మరొకరు ఓడారని భావించకూడదని బొత్స సూచించారు. ఇరుప్రాంత నేతల వాదనలు సబబేనని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్ధులెవరు పోటిలో ఉండరని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు అభ్యర్ధులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version