Site icon TeluguMirchi.com

ఫుల్ గా వాడుకోండి !

Botsa-Satyanarayana1ప్రతిపక్షాలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను ఫుల్ గా వాడుకోవాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఈరోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులకు సామాజిక మీడియాపై ఆ పార్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ బొత్స మాట్లాడుతూ.. ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో సోషల్ మీడియాలో ముందుండటం అవసరమని బొత్స సూచించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయమని బొత్స కాంగ్రెస్ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Exit mobile version