Site icon TeluguMirchi.com

పల్లె పల్లెలో సోనియా సమాధి..!

payyavula-fire-on-govt-for-కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సమాధి కట్టిన వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తమ అధినేత్రికి సమాధి కట్టడం పట్ల కాంగ్రెస్ కు చెందిన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కరుడు గట్టిన సమైక్యవాదులు, తెదేపా నేతలు పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారు. తెలుగు జాతిని చీల్చిన సోనియాకు సమాధి కట్టడం సరైందేనని వారు వాదిస్తున్నారు. తాజాగా.. తెదేపా సీనియర్ నేత.. పయ్యావుల కేశవ్ సోనియాపై విరుచుకు పడ్డారు. రాష్ట్ర విభజనకు పూనుకున్న సోనియాగాంధీకి ఒక్క ఊర్లోనే కాదు… ప్రతి పల్లెలోనూ సమాధి కడతామని ఘాటుగా స్పందించారు. సోనియా సమాధి కేసులు ఎదుర్కొంటున్న వారిని తెలుగుజాతి యోధులుగా గుర్తిస్తుందని అన్నారు. ఇప్పుడు విమర్శిస్తున్న వారు.. సీమాంధ్ర ప్రయోజనాలకు సమాధి కట్టినప్పుడు ఏమయ్యారని దుయ్యబట్టారు. కేసీఆర్ చెబుతున్నట్టు తమది బిర్యానీ కోసం ఆరాటం
కాదని… రాగిముద్ద కోసం పోరాటమని పయ్యావుల ఎద్దేవా చేశారు.

Exit mobile version