Site icon TeluguMirchi.com

నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడను : పయ్యావుల

payyavula keshav tdpపార్టీ మారుతున్నట్లు నాపై వస్తున్న కథనాలు అవాస్తవం, వైఎస్ ఆర్సీపీ కావాలనే మైండ్ గేమ్ ఆడుతోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఏళ్ల తరబడి కష్టించి ఏర్పర్చుకున్న ఇమేజ్ ను ఓ పత్రిక కథనంతో దెబ్బతీయడం బాధించిందని ఆయన అన్నారు. “నేను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని వీడను, టీడీపీలోనే ఉంటూ పార్టీకోసం సైనికునిలా పోరాడుతానని, మరింత పట్టుదలతో పార్టీకోసం పనిచేస్తా”నని పయ్యావుల అన్నారు. ఇటువంటి వార్తలు ప్రచురించే ముందు మీడియా జాగ్రత్తగా రీసెర్చ్ చేయాలని ఆయన సూచించారు. పయ్యావుల కేశవ్  ఓ దశలో తనపై వచ్చిన తప్పుడు వార్తలపై భావోద్వేగానికి లోనయ్యారు.

Exit mobile version