Site icon TeluguMirchi.com

పక్కదారి పట్టించేందుకే రాయల తెలంగాణ: కేశవ్

payyavulaమిగులు జలాలపై కడుతున్న 11 ప్రాజెక్టులు ఒట్టి  కుండలేనని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో  ఆయన మాట్లాడుతూ…  మిగులు జలాలపై వైఎస్ ఇచ్చిన లేఖ ఇవాళ రాష్ట్రానికి మరణ శాసనమైందన్నారు. వైఎస్ జల యజ్ఞం ఎందుకు ప్రారంభించారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు. నీటి పారుదల గురించి తెలియని న్యాయవాదితో ట్రైబ్యునల్ లో వాదనలు వినిపించారని ఆయన విమర్శించారు. ట్రైబ్యునల్ తీర్పుపై న్యాయ, నీటి పారుదల నిపుణులతో కమిటీ వేయాలని దాని సూచనల మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే రాయల తెలంగాణ ప్రతిపాదన అని విమర్శించారు.

Exit mobile version