Site icon TeluguMirchi.com

రహస్య అజెండాగా బిల్లును ప్రవేశపెట్టారు !

payyavula keshavరహస్య అజెండాగా తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో 10 గంటలకు ప్రవేశపెడతారని తెలంగాణ సభ్యులకు మాత్రమే సమాచారం ఉందని అన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. అజెండాలో లేకుండా, కొందరికి చెప్పి బిల్లు ప్రవేశపెట్టడంతోనే తాము ప్రతిఘటించామని పయ్యావుల తెలిపారు.

కొంతమంది తెలంగాణ నేతలు బిల్లుపై చర్చ ప్రారంభమైందని అంటున్నారనీ, వాస్తవానికి ఇంకా ప్రారంభం కాలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై బీఏసీలో నిర్ణయం తీసుకోబడుతుందని పయ్యావుల తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితేనే 20 రోజులు విరామమిస్తారని, అలాంటిది సీమాంధ్ర ప్రజల జీవితాలను ప్రభావితం చేసే బిల్లు గంటల్లో ఎలా ఆమోదం పొందుతుంది? అని ప్రశ్నించారు.

Exit mobile version