Site icon TeluguMirchi.com

సీఎం ది మీడియా సమైక్యవాదం !

payyavulaరాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లులోని లోపాలపై సుప్రింకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి ఎలా తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. పరస్పర విరుద్దమైన అంశాలతో ఉన్న తెలంగాణ బిల్లును తక్షణం నిలిపివేయవలసిన అవసరం ఉందని, దీనిపై న్యాయసమీక్ష జరిగితే తప్పక న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

సీఎం కిరణ్ కేవలం మీడియా ముందు మాత్రమే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తనకున్న అన్ని అవకాశాలను ముఖ్యమంత్రి ఉపయోగించుకోవాలని సూచించారు.

Exit mobile version