వారి కోసం సర్వస్వం దారబోస్తా : పవన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీకాకుళంలో పర్యటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఉద్దానం కిడ్ని బాధితుల సమస్యలపై ఒక రోజు దీక్ష కూడా చేశారు. తాజాగా, శ్రీకాకుళం వి. కన్వెన్షన్ సెంటర్‌లో జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘సామాజిక శాస్త్రవేత్తగా నాయకత్వాన్ని అందించాలనుకుంటున్నా. సమాజాన్ని అర్థం చేసుకుంటేనే ఆ పని చేయగలను. తాను రాజకీయాల్లోకి వచ్చింది సామాజిక రాజకీయ మార్పు కోసమే. సగటు మనిషి కోసం సర్వస్వం దారబోస్తా’నన్నారు.