Site icon TeluguMirchi.com

మళ్ళీ జనంలోకి జనసేన


జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో పర్యటనకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల ఇబ్బందులన్నీ తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు పవన్. జిల్లా పర్యటనలో భాగంగా బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఇందుకు ఎన్‌టీఆర్‌ ఎంహెచ్‌ స్కూల్‌ మైదానం ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

పవన్‌ కల్యాణ్ తన పర్యటనలో ‘కొవ్వాడ’ను కూడా సందర్శించే అవకాశాలున్నాయి. గతంలో ఉద్దానంలో పర్యటించినప్పుడు అక్కడ కిడ్నీ వ్యాధి సమస్యపై ప్రభుత్వం స్పందించింది. ఆ బాధితులను ఆదుకునేందుకు ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. అలాగే మత్స్యకార్లు సమస్యలపై కూడా కదలిక వస్తుందని వారు భావిస్తున్నారు. పవన్‌ రాక కోసం మత్స్యకార్లంతా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version