మోడీకి జైకొట్టిన పవన్ !

pawan-modi

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మోడీకి మరోసారి జైకొట్టారు. జనసేన పార్టీని నెలకొల్పిన వారంలోపే భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలసిన పవన్.. తన సంపూర్ణ మద్దతును తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా, నిన్న (గురువారం) వైజాగ్ లో జగిన సభలోనూ పవన్ మోడీ జపం చేశారు. తప్పుని తప్పని చెప్పే నాయకుడు ఒక్క మోడీనే అని కితాబిచ్చాడు. భాజాపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నానని పవన్ స్పష్టం చేశారు. మోడీని ప్రధానిగా చూడాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నెరవేరుతుందని.. మోడీ ప్రధాని కావడం ఖాయామని ఆవేశంగా అన్నారు.