గోదావరి కబ్జాకు రెడీ!

pawankalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా విమర్శనా బాణాలను ఎక్కుపెడుతున్నాడు. నిన్న మోడీ సమక్షంలో జగన్ పై నిప్పులు చెరిగిన పవన్.. నేడు తణుకులో మరోసారి జగన్ ను టార్గెట్ చేశారు. ఈరోజు తణుకు ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ.. జగన్ అనుచరులు హైదరాబాదు చుట్టూ భూ కబ్జాలు చేశారు…. ఇప్పుడు గోదావరి జిల్లాలను దోచుకునేందుకు రంగం సిద్ధం చేశారని అన్నారు. వైఎస్ దోపిడీ వల్లే రాష్ట్ర విభజనకు బీజం పడిందని పవన్ ఆరోపించారు. తెలంగాణలో వైఎస్ దోపిడీ వల్లే జగన్ ను రాళ్లతో తరమికొట్టారని పవన్ అన్నారు. జగన్ హఠావో…సీమాంధ్ర బచావో అని పవన్ పిలుపునిచ్చారు