Site icon TeluguMirchi.com

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం !

Parl-budget-sessionపార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత వారం చోటుచేసుకున్న అయిదు సంవత్సరాల పాప రేపు, కోల్ అంశం.. తదితర అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి రెడీగా ఉన్నాయి. సంచలనం సృష్టిస్తున్న కోల్ అంశంపై చర్చ చేపట్టాలని సభలో నోటీసు ఇచ్చామని భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 2జీ, బొగ్గు కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వాన్నినిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాష్ర్టంలోని ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఉక్కు కర్మగారం ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు లోక్ సభ స్పీకర్ కు సావధానతీర్మానం ఇచ్చారు.

Exit mobile version