’టీ’-బిల్లుకు ఓటేస్తా : పనబాక

panabakaఅధిష్టాన నిర్ణయానికి విస్పష్టంగా మద్దతు ప్రకటించారు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అధిష్టానం ప్రవేశపెట్టబోయే తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తానని పనబాక అన్నారు. ’టీ’-బిల్లుపై అధిష్టానం విప్ జారీచేసినా, చేయలేకపోయినా.. అధిష్టాన నిర్ణయాన్ని అనుసరించి తాను తెలంగాణకు అనుకూలంగా ఓటేస్తానని ఆమె చెప్పడం విశేషం. గుంటూరు జిల్లా బాపట్లలో పనబాక విలేకర్లతో మాట్లాడుతూ.. కేంద్రానికి ఆంటోనీ కమిటీ నివేదించిన అంశాలను బిల్లులో పొందుపరచాలని అధిష్ఠానాన్ని కోరతానని అన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రను సింగపూర్ లా డెవలప్ చేస్తామని పనబాక తెలిపారు. అయితే, పనబాక వ్యాఖ్యల పట్ల సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మరికొందరు
కేంద్ర మంత్రులు సైతం పనబాక వ్యాఖ్యలను ఏకీభవించినట్లు సమాచారం. పనబాకకు మద్దతు పలికే మరికొందరు సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎవరనేది తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!