భారత సరిహద్దుల్లో పాక్ కాల్పులు

pak armyభారత దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. తాజాగా భారత సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై కాల్పులు జరిపి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పూంచ్ సెక్టార్ లోని మూడు భారత సైనిక పటాలాలపై కాల్పులు జరిపింది. తాము ఇంకా 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబట్టుబడి ఉన్నామని ఆదేశ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే పాక్ మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. కొద్దిరోజుల క్రితం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి ఇద్దరు భారత జవాన్లను అతి కిరాతకంగా చంపి వారి తలలను నరికివేసి అందులో ఓ జవాను తలను వెంటతీసుకెళ్ళిన విషయం తెలిసిందే.