Site icon TeluguMirchi.com

చిద్దూ అమెరికా పర్యటన !

chidambaramకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ఈరోజు (సోమవారం) అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకూ చిదంబరం అమెరికా పర్యటన జరగనుంది.ఈ నెల 11న అమెరికా-భారత్ వ్యాపార మండలి (యూఎస్ ఐబీసీ) నాయకత్వ సదస్సులో చిదంబరం పాల్గొని ప్రసంగిస్తారు. అమెరికా ఆర్థిక మంత్రితో పాటుగా, ఆదేశ పారిశ్రామిక వేత్తలతో చిద్దూ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా చిదంబరం.. అమెరికా పారిశ్రామిక వేత్తలను భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజు రోజుకి దిగజారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చిదంబరం విదేశీ పర్యటన ఆర్థిక వృద్ధి దిశగా ఉంటుందని ఆర్థిక శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version