Site icon TeluguMirchi.com

పేదలను ఆదుకోవడమే మా లక్ష్యం..!

cm-kiranపేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈరోజు (గురువారం) ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 67వ  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్ తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల తర్వాత 20 సూత్రాల పథకం అమలులో ప్రథమ స్థానం సాధించామని వెల్లడించారు. ఆడపిల్లల సంరక్షణ కోసమే ‘బంగారుతల్లి’ పథకం అని సీఎం అన్నారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేసి భవిష్యత్ లో మరింత ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి పులుపునిచ్చారు.

Exit mobile version