Site icon TeluguMirchi.com

ఓయూ.. “ఛలో బయ్యారం”

OU-JAC‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’ నినాదంతో.. తెలంగాణ ఖనిజ సంపదను కాపాడుకోవడానికి “ఛలో బయ్యారం” బస్సు యాత్రను చేపట్టనున్నట్లు ఓయూ జేఏసీ ప్రకటించింది. ఓయూలో ఈరోజు సమావేశమైన జేఏసీ నాయకులు విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణ ఖనిజ సంపదను తరలించకుండా.. ఇక్కడే కర్మాగారాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు.. బయ్యారం ఉక్కపై తమ వైఖరిని స్పష్టం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో.. వైకాపా..తమ వైఖరిని స్పష్టం చేయాలని… లేనిపక్షంలో ఆ పార్టీ చేవెళ్లలో చేపట్టే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

Exit mobile version