Site icon TeluguMirchi.com

ఢిల్లీలో చక్రం తిప్పే శక్తి ఒక్క తెదేపాకే వుంది !

cbnఎన్నికల తర్వాత తెదేపా ఒక్కటే మిగులుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే అన్ని స్థానాల్లోనూ తెదేపా గెలుపు ఖాయమనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ..ఢిల్లీలో చక్రం తిప్పే శక్తి ఒక్క తెదేపాకే ఉందన్నారు. తెదేపాకు ఓటు వేస్తే సీమాంధ్రలో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించి చూపుతామన్నారు. వైకాపా నేత జగన్ ఎంపీ సీటుకు రూ. 50 కోట్లు, ఎమ్మెల్యే సీటుకు రూ. 10 కోట్లు వసూలు చేస్తున్నారని, ఎస్సీల వద్ద మినహాయింపు కింద రూ. 6 కోట్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Exit mobile version