టీ చర్చకు వారం గడువు ?

pranb mukharjeeఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చించేందుకు ఒక వారం మాత్రమే గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారం గడువు ఇచ్చేందుకే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కోరినట్లు నాలుగు వారాలు ఇవ్వకపోయినా వారం గడువు పెంచే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రపతి నిర్ణయం అధికారికంగా రేపు (గురువారం ) వెలువడే అవకాశం ఉందని, దీనిని నేరుగా స్పీకర్ అసెంబ్లీలో ప్రకటించవచ్చని తెలుస్తోంది.