Site icon TeluguMirchi.com

పాతబస్తీలో ఉద్రిక్తత

oldcityహైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం నేత అసరుద్దీన్ ఓవైసీ అరెస్ట్ తో మరోసారి పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. మెదక్ జిల్లా కలెక్టర్, జేసీలను దూషించిన కేసులో అసదుద్దిన్ సంగారెడ్డి కోర్టులో ఈరోజు (సోమవారం) ఉదయం హాజరయ్యారు. అనంతరం అసరుద్దెన్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. అసదుద్దీన్ అరెస్టు, రిమాండ్ కు పంపిన నేపథ్యంలో ఎంఐఎం కార్యకర్తలు పాతబస్తీలో బంద్ కు పిలుపునిచ్చారు. దుకాణాలను మూయిస్తున్న ఎంఐఎం కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేయగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో అల్లరి మూకలను అడ్డకునేందుకు, పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేసేందుకు బారీగా పోలీసు బలగాలను మోహరించారు. అసదుద్దీన్ అరెస్ట్ కు నిరసనగా ఎంఐఎం కార్యకర్తలు రేపు సంగారెడ్డి బంద్ కు పిలుపునిచ్చినట్టు సమాచారం.

Exit mobile version