Site icon TeluguMirchi.com

కళంకిత మంత్రులు తప్పుకోవాల్సిందే : బాబు

Chandrababuకళంకిత మంత్రుల వ్యవహారంపై పోరును తెదేపా ఉద్దృతం చేసింది. కళంకిత మంత్రులను తొలగించాలంటూ.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) పార్టీ నేతలతో కలిసి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న బాబు… అవినీతి మంత్రులు రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు ఈ వ్యవహారంపై తెదేపా శ్రేణులు జిల్లాల వారీగా ఆందోళనలు చేపట్టారు. చిత్తూరు, ఆదిలాబాద్, అనంతరపురం, నల్గొండ.. తదితర జిల్లాల్లో ధర్నా, రాస్తారోకోలు చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం నుంచి కళంకిత మంత్రులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు రాజీనామాలు చేశారంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version