Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో బాబుకు ఘనస్వాగతం !

ncbnతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు ఈ రోజు విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు బాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మేడే వేడుకల్లో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. త్వరలో కార్మికులకు ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని హామి ఇచ్చారు. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేవరకు తెదేపా రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని బాబు ప్రకటించారు. కేంద్రంలోని అవినీతి పెద్దలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని బాబు ఆరోపించారు.

Exit mobile version