‘అమ్మ’ మినరల్ వాటర్ ప్రారంభం

Amma mineral water launchedతమిళనాడు ముఖ్యమంత్రి జే జయలలిత ‘అమ్మ మినరల్ వాటర్’ పేరుతో మరో కొత్త పథకాన్ని చెన్నైలో ప్రారంభించారు. చెన్నై సమీపంలోని గుమ్మిడిపూండి వద్ద రోజుకు 3 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆమె ప్రారంభిస్తూ మంత్రి సెంథిల్ బాలాజీ నుంచి తొలి బాటిల్ ను పది రూపాయలిచ్చి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  రైల్వేల్లో లీటర్ నీళ్ళ బాటిల్ ను రూ.15లకు, ప్రైవేటు కంపెనీలు రూ.20లకు విక్రయిస్తున్నాయని, తాము రూ.10లకే అందిస్తున్నామని చెప్పారు. ఈ వాటర్ బాటిళ్ళను బస్ స్టేషన్లలోనూ, దూరప్రాంతాలకు వెళ్ళే బస్సుల్లోనూ విక్రయిస్తారు. ఇటీవల జయలలిత ‘అమ్మ క్యాంటిన్’ పేరిట అల్పాదాయ వర్గాల కోసం చెన్నైలో రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకు భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే.