తెలుగు మహాసభలు కాదు అవినీతి సభలు : గాలి

muddu-krishnama-naiduటీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కాంగ్రెస్ పార్టీ మరోసారి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావును అవమానపరిచిందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం భారీగా ఖర్చుచేసి మరీ తిరుపతిలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏకంగా దేశ ప్రధానిగా సేవలందించిన మన తెలుగువాడైన పీవీకి కనీసం కూడా గుర్తింపు లభించలేదన్నారు. ముద్దుకృష్ణమనాయుడు తిరుపతిలో జరిగినవి తెలుగు మహాసభలు కాదు… అవినీతి మహాసభలంటూ మండిపడ్డారు. ఇటలీ మహిళ కాళ్ల దగ్గర తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెట్టిన ఘటన కాంగ్రెస్ నేతలదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.