Site icon TeluguMirchi.com

సీఎంగా కొనసాగే అర్హత లేదు..!

gutta sukendhar reddyరాష్ట్ర విభజపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారాన్నే లేపాయి. సీమాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రిగా కిరణ్ ప్రవర్తిస్తున్నాడని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు  సీఎంకు లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ మధ్య సామరస్యాన్ని నెలకొల్పాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. సీమాంధ్రకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేస్తిన కిరణకు సీఎం పదవిలో కొనసాగే అర్హతలేదని గుత్తా అన్నారు. అయితే, ముఖ్యమంత్రి పై అధిష్టానం ఫిర్యాదు చేయడంతో పాటుగా, ఆయన నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరుకావోద్దన్ని తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

Exit mobile version