Site icon TeluguMirchi.com

పార్టీని విడటం అంతసులువు కాదు !

kavuriత్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఏలూరు స్థానం నుంచే పోటీ చేస్తానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలా? వద్దా అన్న సందేహంలో ఉన్నానని, ’40ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న నేను… పార్టీ వీడాలంటే అంత సులభం కాదు’ అని చెప్పుకొచ్చారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ముంపు ప్రాంతాలు సీమాంధ్రలో కలిపేందుకు ఆర్డినెన్స్ రానుందని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో ఏకాభిప్రాయం లేనందువల్లే రాష్ట్రపతి పాలన విధించారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో దొంగల్లా పెట్టారని విమర్శించారు. సీమాంధ్ర కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య కృష్ణానది తీరంలో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

Exit mobile version