అక్బర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ !

Akbaruddin-Owaisiవివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి మళ్లీ చుక్కెదురైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి కోర్టు అక్బర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీచేసింది. ఈ కేసులో విచారణను కోర్టు మే 8కి వాయిదా వేసింది. గతంలో వాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బెయిల్ పై అక్బర్ విడుదలైన విషయం తెలిసిందే. కోర్టు నాన్ బెయిలబుల్ జారీ చేసిన నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా పోలీసులు అక్బర్ ను అరెస్ట్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో అక్బర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సాహసం చేస్తురా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది !