అక్భర్ కు మళ్ళీ జైలుకేనా… ?

akbarఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బర్ కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అక్బర్ ను ఈ నెల 9వ తేదీలోగా తమ ఎదుట హాజరుపర్చాలని న్యాయస్థానం మాదన్నపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదిలాబాద్ నిర్మల్ సభలో అక్భర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కరుణాసాగర్ అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఈరోజు (గురువారం) విచారించిన కోర్టు ఆయన పై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసినట్టు తెలుస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఊచలు లెక్కపెట్టిన ఆయన తాజా కోర్టు తీర్పుతో.. మరోసారి జైలుకెళ్ళడం తప్పనిసరైంది.