రాజయ్య, బలరాం నాయక్ లపై వారెంట్ !

balaram-naik-rajaiahఎంపీ రాజయ్య, కేంద్రమంత్రి బలరాం నాయక్ లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గానూ కోర్టు ఈ వారెంట్ జారీచేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల సందర్భంగా.. స్టేషన్ ఘన్ పూర్ లో ప్రార్థనామందిరంలో ప్రచారం నిర్వహించారన్న అభియోగంపై నమోదైన కేసు విచారణకు గైర్హాజరైనందుకు కోర్టు వీరి ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.