Site icon TeluguMirchi.com

అలీకి ఆ పదవి కట్టబెట్టిన జగన్‌

వైకాపాకు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన సినీ ప్రముఖుల్లో ముఖ్యలు అలీ, పృథ్వీ, పోసాని. ఈ ముగ్గురు కూడా వైకాపాకు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరికి పదవులు వచ్చే అవకాశం ఉందని భావించారు. అనుకున్నట్లుగానే వైకాపా తరపున ప్రచారం చేసిన పృథ్వీకి ఎస్వీఎస్‌ భక్తి ఛానెల్‌కు చైర్మన్‌గా నియమించడం జరిగింది. ఇప్పుడు అలీకి ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ పదవిని కట్టబెడుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నాడు.

ఇక పోసానికి కూడా ఏదో ఒక నామినేటెడ్‌ పదవి ఇవ్వాలని జగన్‌ భావించినా కూడా ఆయనకు మాత్రం ఆసక్తిగా ఉన్నట్లుగా లేదు. జగన్‌ను నమ్మినందుకు ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇచ్చి న్యాయం చేస్తాడంటూ అందరు నమ్ముతున్నారు. అన్నట్లుగానే అలీకి ఇప్పుడు ఈ పదవి ఇవ్వడంతో ఆయన మరోసారి తన అనుకున్న వారికి న్యాయం చేస్తాడని నిరూపితం అయ్యింది. ఈమద్య కాలంలో ఏపీలో సినిమా అభివృద్దికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం అలీ ఏమేరకు తన వంతు కృషి చేస్తాడో చూడాలి.

Exit mobile version