Site icon TeluguMirchi.com

సభలూ.. సమావేశాలకు నో పర్మిషన్ !

Charminar,_Hyderabad,_Andhra_Pradeshఇటు సమైక్య, అటు తెలంగాణ ఆందోళన దృష్ట్యా నగరంలో ఆకాంక్షలు విధించారు. ఈ నెల పదవ తేది వరకు ఎలాంటి సభలూ.. సమావేశాలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ రెండు కిలో మీటర్ల పరిధిలో 144 సెక్షన్ ను విధించారు. సీన్ లో సచివాలయ సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పై ఆంక్షల గురించి ఉద్యోగ సంఘాల నేతలకు వివరించినట్లు తెలుస్తోంది. ఒక వేళ శాంతి యుతంగా నిరసన తెలపాలనుకుంటే.. సీమాంధ్ర ఉద్యోగులు నల్లపోచమ్మ గుడి వద్ద, టీ-ఉద్యోగులు కే-బ్లాక్ వద్ద తమ తమ నిరసనలు తెలుపుకోవచ్చని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 6, 7 తేదీల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీగా నిర్వహించ తలపెట్టిన ర్యాలీల నేపథ్యంలో.. ఈ ఆంక్షలు విధించినట్లు సమాచారం.

Exit mobile version