ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదు !

botsaరాజీనామా చేయొద్దని శ్రీధర్ బాబుకు చెప్పానని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసన సభ వ్యవహారాల మంత్రిగా ఎవరున్న సీమాంధ్ర, తెలంగాణ అంశాలతో సంభంధం లేదన్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబులు మాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న ఆరోపణను ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కి ఎవరి వాఖనైనా మార్చే అధికారం ఉంటుందని, కాకపోతే శ్రీధర్ బాబు వేరే కోణంలో చూస్తున్నారని బొత్స అభిప్రాయ పడ్డారు. సమైక్య తీర్మానం చేయడానికి ఇంకా సమయం మించి పోలేదని వెల్లడించారు.